ఒగ్గు సంప్రదాయాన్ని కొనసాగించాలి: మంత్రి
ABN , First Publish Date - 2022-01-25T07:41:25+05:30 IST
: కొమురవెల్లి దేవస్థానంలో ఒగ్గు సంప్రదాయాన్ని కొనసాగించాలని
హైదరాబాద్, జనవరి 24(ఆంధ్రజ్యోతి): కొమురవెల్లి దేవస్థానంలో ఒగ్గు సంప్రదాయాన్ని కొనసాగించాలని మంత్రి శ్రీనివా్సగౌడ్ అధికారులను ఆదేశించారు. ఒగ్గు పూజారులే మల్లన్నకు పూజలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. దేవాదాయ శాఖ అధికారులు.. కొమురవెల్లి దేవస్థానంఽలో ఒగ్గు సంప్రదాయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారంటూ ఒగ్గు పూజారులు ఆందోళన చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేవాదాయ, సాంస్కృతిక శాఖ ఉన్నతాధికారులు, ఒగ్గు పూజారులతో మంత్రి శ్రీనివా్సగౌడ్ సోమవారం సమావేశం నిర్వహించారు. గొల్ల కురుమ, ఒగ్గు పూజారుల మనోభావాలకు భంగం కలుగకుండా దేవస్థానంలో సంప్రదాయాలను కొనసాగించాలని స్పష్టం చేశారు.