ఉప ఎన్నికకు అధికారులు సమాయత్తం

ABN , First Publish Date - 2021-08-04T05:00:25+05:30 IST

బద్వేలు నియోజకవర్గ ఉప ఎన్నికకు అధికారులు సమాయత్తమవుతున్నారు.

ఉప ఎన్నికకు అధికారులు సమాయత్తం
పోలింగ్‌ బూత్‌లను పరిశీలిస్తున్న అధికారులు

బూత్‌ల పరిశీలనలో తహసీల్దార్లు, అధికారులు

గోపవరం, ఆగస్టు 3: బద్వేలు నియోజకవర్గ ఉప ఎన్నికకు అధికారులు సమాయత్తమవుతున్నారు. బద్వేలు ఎమ్మెల్యే మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ పరిస్థితుల్లో ఈ నెలలోనే నోటిఫికేషన్‌ రావచ్చన్న సమాచారంతో అధికారులు ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేశారు. ఇందులో భాగంగా మంగళవారం నియో జకవర్గం పరిధిలోని పోలింగ్‌ బూత్‌లను తహసీల్దారు రమణారెడ్డి, డిప్యూటీ తహసీల్దారు వెంకటరమణ పరిశీలించారు.

మండల పరిధి పోలింగ్‌ బూత్‌ల స్థితిగతు లు పరిశీలించి ప్రస్తుతం వాటి పరిస్థితిని ఉన్నతాధికారులకు నివేదిస్తామని తదుప రి అధికారుల నుంచి వచ్చే సూచనల మే రకు ఎన్నికల ప్రక్రియను వేగవంతం చే యాల్సి ఉంటుందన్నారు. కార్యక్రమంలో వీఆర్వోలు వెంకటేశ్వర్లు, ఆదినారాయణ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

కాశినాయనలో...

కాశినాయన ఆగష్టు 3: ఉప ఎన్నికను దృ ష్టిలో పెట్టుకుని మంగళవారం మండలంలోని పోలింగ్‌ బూత్‌లను పరిశీలించిన ట్లు తహసీల్దారురవిశంకర్‌ తెలిపారు. మండలంలో మొత్తం 27 పోలింగ్‌ కేంద్రా లను పరిశీలించి అందులోని మౌలిక వసతులపై సమగ్ర నివేదికను జిల్లా అధికారులకు పంపుతామన్నారు. ఈయన వెంట ఆర్‌ఐ మోహన్‌రాజు పాల్గొన్నారు.

- అట్లూరు, ఆగస్టు 2: మండల వ్యాప్తం గా పోలింగ్‌ సేషన్లను మంగళవారం తహసీల్దార్‌ ఇందిరరాణీ సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె పోలింగ్‌ సేషన్లలో ఉన్న బాక్స్‌ల భద్రత, విద్యుత్‌ సౌకర్యం తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆర్‌ఐ సుధాకర్‌రెడ్డి, అట్లూరు సచివాలయం సెక్రెటరీ చంద్రలతో పాటు బీఎల్‌ఓలు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-04T05:00:25+05:30 IST