చెరువును పరిశీలించిన అధికారులు

ABN , First Publish Date - 2022-07-02T05:18:23+05:30 IST

గద్వాల జిల్లా కొండేరు శివారులోని లక్ష్మమ్మ చెరువులో ఓ ఫ్యాక్టరీ కలుషిత నీరు కలవడం వల్ల చేపలు మృతి చెందడంపై ‘కాలుష్యం కాటు’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో గురువారం ప్రచురితమైన క థనానికి అధికారులు స్పందించారు.

చెరువును పరిశీలించిన అధికారులు
చెరువును పరిశీలిస్తున్న అధికారులు

కొండేరు లక్ష్మమ్మ చెరువులో కలుషిత నీరు చేరి ఉండొచ్చన్న మత్స్యశాఖ అధికారి రూపేందర్‌సింగ్‌

నీటిని తీసుకెళ్లి పరిశీలించి నిర్ధారిస్తామని వెల్లడి

జరిగిన నష్టంపై ఆరా


ఎర్రవల్లి చౌరస్తా, జూలై 1: గద్వాల జిల్లా కొండేరు శివారులోని లక్ష్మమ్మ చెరువులో ఓ ఫ్యాక్టరీ కలుషిత నీరు కలవడం వల్ల చేపలు మృతి చెందడంపై ‘కాలుష్యం కాటు’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో గురువారం ప్రచురితమైన క థనానికి అధికారులు స్పందించారు. జిల్లా మత్స్యశాఖ అధికారి రూపేందర్‌సింగ్‌ శుక్రవారం లక్ష్మమ్మ చెరువును పరీశీలించారు. ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న కలుషిత నీరు చెరువులోకి చేరే అవకాశం ఉందని, చెరువులోని నీటిని తీసుకెళ్లి పరీశీలించి నిర్ధారిస్తామని అన్నారు. తదుపరి రిపోర్ట్‌లను కలెక్టర్‌కు సమర్పిస్తామని మత్స్యకారులతో పేర్కొన్నారు. సొసైటీ అధ్యక్షుడు మద్దిలేటిని అడిగి జరిగిన నష్టాన్ని తెలుసుకున్నారు. 

Updated Date - 2022-07-02T05:18:23+05:30 IST