దళితుల భూములు లాక్కుంటున్న అధికారులు

ABN , First Publish Date - 2022-07-02T04:11:02+05:30 IST

దళితుల భూములను బలవంతంగా లాక్కుంటున్నారని శుక్రవారం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఎంసీపీఐయూ నాయకులు ధర్నా నిర్వహించారు. అంతకుముందు దళితులతో కలిసి కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఎంసీపీఐయూ జిల్లా కార్యదర్శి సబ్బనికృష్ణ మాట్లాడుతూ కన్నె పల్లి మండలంలోని చుట్టు పక్కల గ్రామాల్లో నిరుపేదలు, దళితులు భూములను సాగు చేసుకుంటున్నారని తెలిపారు.

దళితుల భూములు లాక్కుంటున్న అధికారులు
తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న ఎంసీపీఐయూ నాయకులు

కన్నెపల్లి, జూలై 1: దళితుల భూములను బలవంతంగా లాక్కుంటున్నారని శుక్రవారం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఎంసీపీఐయూ నాయకులు ధర్నా నిర్వహించారు. అంతకుముందు దళితులతో కలిసి కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఎంసీపీఐయూ జిల్లా కార్యదర్శి సబ్బనికృష్ణ మాట్లాడుతూ కన్నె పల్లి మండలంలోని చుట్టు పక్కల గ్రామాల్లో నిరుపేదలు, దళితులు భూములను సాగు చేసుకుంటున్నారని తెలిపారు. దళితులు, నిరుపేదల భూములను క్రీడా మైదానాలుగా, పల్లె ప్రకృతి వనాల కోసం లాక్కుంటున్నారని ఇది సరైంది కాద న్నారు. బలవంతంగా లాక్కున్న దళితుల భూములకు పట్టాలు చేసి ఇవ్వాలని, లేకపోతే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. నాయకులు రాజేంద్ర ప్రసాద్‌, శ్రీను, రాజలింగు, భీమేష్‌, సమ్మయ్య, స్రవంతి, పద్మ, లక్ష్మీ,  పాల్గొన్నారు.  

Updated Date - 2022-07-02T04:11:02+05:30 IST