ఆర్థికమంత్రి Nirmala Sitharaman పై ప్రశంసలు జల్లు.. కారణం ఏంటంటే..
ABN , First Publish Date - 2022-05-10T02:21:29+05:30 IST
ముంబై : కేంద్ర ఆర్థిక మంత్రి Nirmala Sitharaman పై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ముంబైలో జరిగిన NSDL (నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీస్ లిమిటెడ్)
ముంబై : కేంద్ర ఆర్థిక మంత్రి Nirmala Sitharaman పై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ముంబైలో జరిగిన NSDL (నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీస్ లిమిటెడ్) silver jubilee వేడుకల్లో ఎండీ చుండూరు పద్మజకు సీతారామన్ స్వయంగా మంచి నీళ్లు అందించారు. అప్పటికే కొద్దిసేపు మాట్లాడిన చుండూరు పద్మజకు దాహం వేసింది. వాటర్ బాటిల్ అందుబాటులో లేకపోవడంతో నీళ్లు కావాలంటూ సంకేతమిచ్చారు. అదే వేదికపై ఉండి గమనించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెంటనే లేచి వాటర్ బాటిల్ తీసుకెళ్లి ఇచ్చారు. వెంటనే చుండూరు పద్మజ దాహం తీర్చుకున్నారు. ఈ సన్నివేశాన్ని గమనించిన ఆడియన్స్ చప్పట్లతో సీతారామన్ను అభినందించారు. చుండూరు పద్మజ కూడా సీతారామన్కు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ప్రసంగాన్ని కొనసాగించారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సీతారామన్ దయాగుణానికి ఇది సంకేతమని నెటిజన్లు కొనియాడుతున్నారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురిపించారు. సీతారామన్ దయాగుణానికి, మానవత్వానికి, విలువకు ఇదొక గొప్ప సంకేతమని కొనియాడారు. కాగా శనివారం ఎన్ఎస్డీఎల్ స్వర్ణోత్సవాల్లో సీతారామన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల కోసం హిందీ, ప్రాంతీయ భాషలలో మార్కెట్ కా ఏకలవ్య అవగాహన కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు.