ఏబీఎన్ కథనాలపై స్పందించిన అధికారులు

ABN , First Publish Date - 2020-07-10T20:42:50+05:30 IST

వైరస్‌తో ప్రాణాలు విడిచిన వారిని అర్ధరాత్రి అంబులెన్స్‌ల ద్వారా

ఏబీఎన్ కథనాలపై స్పందించిన అధికారులు

నెల్లూరు జిల్లా: కరోనా వైరస్‌తో ప్రాణాలు విడిచిన వారిని అర్ధరాత్రి అంబులెన్స్‌ల ద్వారా మృతదేహాలను తరలించి పెన్నానది ఒడ్డున గుట్టుచప్పుడు కాకుండా ఖననం చేయడంపై స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా మృతదేహాల ఖననంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంపై అధికారులు స్పందించారు. దీనిపై జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి విచారణకు ఆదేశించారు.


మరోవైపు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఈ ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు. మృతదేహాలను ప్రొక్లెయిన్ ద్వారా గుంటలో వేయడం చూస్తే బాధ కలిగించిందన్నారు. ఇలాంటి సంఘటనలు పదే పదే పునరావృతం అవుతున్నాయని, జగన్ ప్రభుత్వం బాధిత కుటుంబాలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 

Updated Date - 2020-07-10T20:42:50+05:30 IST