ఎంజీఎంకు ‘సుస్తీ’

ABN , First Publish Date - 2020-08-01T11:17:49+05:30 IST

ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న ఎంజీఎంకు సుస్తీ చేసింది. అసలే బాస్‌ లేక ఇబ్బందిపడుతుంటే ఇపుడు వైద్యాధికారులు సైతం

ఎంజీఎంకు ‘సుస్తీ’

జ్వరంతో సెలవులో ఉన్న అధికారులు

సూపరింటెండెంట్‌ పోస్టు ఖాళీ


హన్మకొండ అర్బన్‌, జూలై 31: ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న ఎంజీఎంకు సుస్తీ చేసింది. అసలే బాస్‌ లేక ఇబ్బందిపడుతుంటే ఇపుడు వైద్యాధికారులు సైతం సెలవుపై వెళ్లడంతో పెద్దాస్పత్రి అనాథగా మిగిలింది. కరోనా వేళ దాన్ని పట్టించుకునే నాథుడే లేకుండాపోయాడు. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో రోగులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. సూపరింటెండెంట్‌ రాజీనామా చేయగా ఇతర ఉన్నతాధికారులు లీవ్‌ పెట్టారు. డిప్యూటీ సూపరింటెండెంట్‌ వెంకటేశ్వర్లు, సివిల్‌ సర్జన్‌ ఆర్‌ఎంవో హరి్‌షరాజ్‌, ఆర్‌ఎంవో-2 వెంకటరమణ ముగ్గురూ జ్వరంతో సెలవుపై వెళ్లారు. దీంతో ప్రస్తుతం ఎంజీఎంకు పెద్ద దిక్కులేకుండా పోయింది. ఇప్పటికైనా రాష్ట్ర ఉన్నత స్థాయి  అధికారులు స్పందించి ఎంజీఎంకు సూపరింటెండెంట్‌ను నియమించాలని జిల్లా ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - 2020-08-01T11:17:49+05:30 IST