అధికారులు సమన్వయంతో పనిచేయాలి

ABN , First Publish Date - 2022-05-28T04:17:07+05:30 IST

అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ పథకాలను సక్ర మంగా అమలయ్యేలా చూడాలని ఎమ్మెల్యే ఆత్రం సక్కు పేర్కొన్నారు.

అధికారులు సమన్వయంతో పనిచేయాలి
మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఆత్రం సక్కు

వాంకిడి, మే 27: అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ పథకాలను సక్ర మంగా అమలయ్యేలా చూడాలని ఎమ్మెల్యే ఆత్రం సక్కు పేర్కొన్నారు. ఎంపీపీ ముండే విమలాబాయి అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే ఆత్రంసక్కు, జడ్పీటీసీ అజయ్‌కుమార్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలుశాఖల అధికారులు తమతమ శాఖల ద్వారా నివే దికలు చదివి వినిపించారు. ఈసందర్భంగా పలువురు ఎంపీటీసీలు పలు సమస్యలను ఎమ్మెల్యే ఆత్రంసక్కు దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో మిషన్‌ భగీరథ ద్వారా ప్రతిఇంటికి నీరు అందించేందుకు చర్యలు తీసుకో వాలని సంబంధిత అధికారులకు సూచించారు. మండలంలో జరుగు తున్న ప్రతిఅధివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ఎంపీపీ, జడ్పీ టీసీ, సర్పంచుతో పాటు ఎంపీటీసీ లను తప్పనిసరిగా ఆహ్వానించా లని అన్నారు. సర్పంచుల సమ్యలను పరిష్కరించేం దుకు కృషిచేస్తానన్నారు. జడ్పీటీసీ అజయ్‌కుమార్‌, మార్కెట్‌ కమిటీచైర్మన్‌మల్లేష్‌, వైస్‌ఎంపీపీ రాజ్‌కుమార్‌, తహసీల్దార్‌ మధుకర్‌, ఎంపీడీవో  వెంకటేశ్వర్‌రెడ్ది, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-28T04:17:07+05:30 IST