నిత్య జనగణమన ప్రారంభం
ABN , First Publish Date - 2022-08-16T06:33:53+05:30 IST
మండల కేంద్రంలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నిత్య జనగణమనను సోమవారం ప్రారంభించారు.
మల్యాల, ఆగస్టు 15: మండల కేంద్రంలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నిత్య జనగణమనను సోమవారం ప్రారంభించారు. కావా ల్సిన ఏర్పాట్లను ప్రభుత్వ ఉపాధ్యాయులు సుబ్బారావు తమ ట్రస్టు ద్వారా చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ మిట్ట పెల్లి విమల, సర్పంచ్ మిట్టపెల్లి సుదర్శన్, తహసీ ల్దార్ సుజాత, ఎంపీడీవో శైలజారాణీ, ఎంపీవో వాసవి, ఉపసర్పంచ్ పోరాజు శ్రీనివాస్, ఎంపీటీసీ రమేశ్, ఈవో గుండేటి రవీంధర్, టీఆర్ఎస్ అధ్యక్షుడు జనగాం శ్రీనివాస్ గ్రామస్థులు పాల్గొన్నారు.