లక్ష్మీనృసింహుడికి అరటి గెలల నైవేద్యం
ABN , First Publish Date - 2021-02-23T05:30:00+05:30 IST
భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని చెట్లతాండ్రలోని లక్ష్మీనృసింహస్వామికి మంగళవారం భక్తులు పెద్దఎత్తున అరటి గెలలు నైవేద్యంగా సమర్పించారు. వేలాది అరటి గెలలతో ఆలయ ప్రాంగణం నిండిపోయింది. ఏటా భీష్మ ఏకాదశి నాడు
చెట్లతాండ్రలో ఆధ్యాత్మిక శోభితం
చెట్లతాండ్ర (సంతబొమ్మాళి), ఫిబ్రవరి 23: భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని చెట్లతాండ్రలోని లక్ష్మీనృసింహస్వామికి మంగళవారం భక్తులు పెద్దఎత్తున అరటి గెలలు నైవేద్యంగా సమర్పించారు. వేలాది అరటి గెలలతో ఆలయ ప్రాంగణం నిండిపోయింది. ఏటా భీష్మ ఏకాదశి నాడు అరటి గెలలను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా మంగళవారం ఉదయం నుంచే ఆలయ ప్రాంగణంలో భక్తులు బారులుదీరారు. ఉత్తరాంధ్రతో పాటు ఒడిశా, చత్తీస్గడ్ల నుంచి తరలివచ్చారు. మొత్తం పది వేల అరటి గెలలు కట్టినట్టు ఆలయ వర్గాలు తెలిపాయి. భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లుచేసింది. మూడురోజుల పాటు సాగే వేడుకల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటుచేసినట్టు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు.