అటు వైపే వెళ్తున్నానంటూ లిఫ్ట్ ఇస్తానందో మహిళ.. సరేనని కారు ఎక్కిన భార్యాభర్తలు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2021-09-14T17:21:01+05:30 IST

ఆ భార్యాభర్తలిద్దరూ ఆటో కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నారు.. అదే సమయంలో ఓ కారు వచ్చి వారి ముందు ఆగింది.

అటు వైపే వెళ్తున్నానంటూ లిఫ్ట్ ఇస్తానందో మహిళ.. సరేనని కారు ఎక్కిన భార్యాభర్తలు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ఆ భార్యాభర్తలిద్దరూ ఆటో కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నారు.. అదే సమయంలో ఓ కారు వచ్చి వారి ముందు ఆగింది.. `మీ ఇంటి వైపే వెళ్తున్నాం, కారు ఎక్కమ`ని లోపల ఉన్న మహిళ అడిగింది.. దీంతో ఆ భార్యాభర్తలిద్దరూ కారు ఎక్కారు.. ఇల్లు రాగానే దిగిపోయారు.. దిగాక చూసుకుంటే మహిళ చేతికి ఉండాల్సిన బంగారు గాజులు లేవు.. దీంతో వారిద్దరూ పోలీసులను ఆశ్రయించారు.. ఛత్తీస్‌గఢ్‌లోని పల్సోరా గ్రామంలో ఈ ఘటన జరిగింది. 


ఇవి కూడా చదవండి

రాత్రి 2.30 గంటలు.. పడుకోకుండా అలా నిలబడ్డావేంటని ప్రశ్నించిన తల్లి.. కూతురి నుంచి నో రెస్పాన్స్.. దగ్గరకు వెళ్లి చూస్తే..





ఓ సారి కలవొచ్చు కదా.. అంటూ టిక్‌టాక్‌ ఫ్రెండ్ అడగడంతో సరేనందా యువతి.. అదే ఆమె పాలిట శాపమైందిలా..!


శనివారం మధ్యాహ్నం హాస్పిటల్‌లో చూపించుకునేందుకు పల్సోరా గ్రామానికి చెందిన కుల్వంత్ కౌర్ అనే మహిళ తన భర్తతో కలిసి హాస్పిటల్‌కు వెళ్లింది. డాక్టరుకు చూపించుకున్న తర్వాత ఇంటికి వెళ్లేందుకు వారిద్దరూ బయటకు వచ్చి ఆటో కోసం చూస్తూ కూర్చున్నారు. ఆ సమయంలో వారి ముందు ఓ కారు వచ్చి ఆగింది. తాము కూడా పల్సోరా వైపే వెళ్తున్నామని, మిమ్మల్ని ఇంటి దగ్గర దించేస్తామని కారులో ఉన్న మహిళ చెప్పింది. ఆ కారు ఎక్కేందుకు ముందు కౌర్ నిరాకరించింది. అయితే కారులోని మహిళ కొంత సేపు మాట్లాడి బలవంత పెట్టడంతో వారు ఎక్కారు. 


కుల్వంత్ కౌర్ వెనక సీటులో మహిళతోపాటు కూర్చోగా, ఆమె భర్త డ్రైవర్ పక్కన కూర్చున్నాడు. పల్సోరా గ్రామం రాగానే కౌర్, ఆమె భర్త దిగిపోయారు. ఇంటికి వెళ్లిన తర్వాత చూసుకుంటే కౌర్ చేతికి ఉండాల్సిన నాలుగు బంగారు గాజులు కనిపించలేదు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించి జరిగింది మొత్తం చెప్పారు. కాగా, ఈ నెలలో ఆ పరిసర ప్రాంతంలో ఆ విధంగా దొంగతనం జరగడం అది మూడోసారి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. 

Updated Date - 2021-09-14T17:21:01+05:30 IST