ఒడిశాలో ఆకస్మాత్తుగా పెరిగిన కరోనా కేసులు
ABN , First Publish Date - 2021-05-14T15:30:37+05:30 IST
ఒడిశా రాష్ట్రంలో ఆకస్మాత్తుగా కరోనా కేసుల సంఖ్య పెరగడం అందరినీ ఆందోళనకు గురిచేసింది....
భువనేశ్వర్ (ఒడిశా): ఒడిశా రాష్ట్రంలో ఆకస్మాత్తుగా కరోనా కేసుల సంఖ్య పెరగడం అందరినీ ఆందోళనకు గురిచేసింది. ఒడిశా రాష్ట్రంలో శుక్రవారం కరోనా కేసుల సంఖ్య 12,390 గా నమోదైంది. గురువారం ఒడిశాలో 10,649 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూడగా, శుక్రవారానికి పెరిగాయి. కరోనాతో 22 మంది మరణించారు. కరోనా రోగుల్లో 6,938 మంది క్వారంటైన్ లో ఉన్నారు. ఒడిశా రాష్ట్రంలో మొత్తం 5,88,687 కరోనా కేసులు నమోదు కాగా, 2,273 మంది మరణించారు. ఒడిశాలోని బారఘడ్ జిల్లాలో అధిక కరోనా కేసులు నమోదు అయ్యాయి. 507 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఒడిశాలోని 31 జిల్లాల్లో కరోనా కేసులు వెలుగుచూశాయి.