Odisha: పూరిలోని జగన్నాథుడి రథయాత్ర ప్రారంభం

ABN , First Publish Date - 2022-07-01T19:41:37+05:30 IST

ప్రముఖ పుణ్యక్షేత్రం పూరిలోని జగన్నాథుడి (Jagannath) రథయాత్ర శుక్రవారం ప్రారంభమైంది.

Odisha: పూరిలోని జగన్నాథుడి రథయాత్ర ప్రారంభం

ఒడిశా (Odisha): ప్రముఖ పుణ్యక్షేత్రం పూరిలోని జగన్నాథుడి (Jagannath) రథయాత్ర శుక్రవారం ప్రారంభమైంది. గత రెండేళ్లుగా కోవిడ్ (Covid) కారణంగా రథయాత్ర నిర్వహించలేదు. ఈ క్రమంలో రథయాత్ర ప్రారంభం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పూరి నగరం లక్షలాది మంది భక్తులతో జనసంద్రాన్ని తలపిస్తోంది. ఈసారి యాత్రకు 15 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేశారు. అందుకు తగినట్లు ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. రథయాత్రలో తొక్కిసలాట లేకుండా బందోబస్తు చేశారు. రథయాత్ర మహోత్సవంలో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి లక్షల్లో భక్తులు తరలివస్తుంటారు. ఈ యాత్ర తొమ్మిది రోజుల పాటు జరుగుతుంది.

Updated Date - 2022-07-01T19:41:37+05:30 IST