ద్యేవుడా.. సెవెన్త్ క్లాస్ తెలివితో కరోనా టీకా తయారీ!

ABN , First Publish Date - 2020-09-27T00:29:17+05:30 IST

ఒడిశాకు చెందిన ఓ యువకుడు జస్ట్ ఏడో తరగతి మాత్రమే చదివాడు. కానీ ఆ తెలివితేటలతోనే అతడు ఏకంగా కరోనా టీకా తయారు చేసి పారేశాడు. అంతేకాదు.. దీన్ని మార్కెట్లో అమ్మేందుకు అనుమతి కావాలంటూ అధికారులకు పనిలోపనిగా ఓ ఈ-మెయిల్ కూడా పెట్టేశాడు.

ద్యేవుడా.. సెవెన్త్ క్లాస్ తెలివితో కరోనా టీకా తయారీ!

భువనేశ్వర్: ఒడిశాకు చెందిన ఓ యువకుడు జస్ట్ ఏడో తరగతి మాత్రమే చదివాడు. కానీ ఆ తెలివితేటలతోనే అతడు ఏకంగా కరోనా టీకా తయారు చేసి పారేశాడు. అంతేకాదు.. దీన్ని మార్కెట్లో అమ్మేందుకు అనుమతి కావాలంటూ అధికారులకు పనిలోపనిగా ఓ ఈ-మెయిల్ కూడా పెట్టేశాడు. అంత నమ్మకం.. అతడికి తన టీకా మీద!


మరి స్థానికులు ఎంత పుణ్యం చేసుకున్నారో తెలీదు కానీ.. అతడు  అనుమతి వచ్చే లోపే టీకా అమ్మకాలకు దిగలేదు. ప్రభుత్వ అనుమతి వచ్చే వరకూ వెయిట్ చేద్దామనుకున్నాడు. ఈ-మెయిల్ చూసి అప్రమత్తమైన అధికారులు హుటాహుటీన అతడి ఇంటికి చేరుకున్నారు.


అక్కడ.. వారికి కరోనా వ్యాక్సిన్ అని రాసున్న కొన్ని వయల్స్, ఇతర కెమికల్స్ కనిపించాయి. ఎలా చేశావయ్యా ఈ టీకాను అని వారు అడగ్గా.. అదంతా టాప్ సీక్రెట్ అని చెప్పుకొచ్చాట. ఇక లాంభలేదనున్న అధికారులు.. అతడిని తక్షణం అరెస్టు చేసి వివిధ సెక్షన్లు కింద కేసు నమోదు చేశారు. ఇతగాడు..గతంలో మరే మందులైనా తయారు చేసి స్థానికులపై ప్రయోగించాడేమో తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన బార్ఘర్ జిల్లాలో ఇటీవల జరిగింది. సదరు ఏడో తరగతి ‘శాస్త్రవేత్త’ పేరు ప్రహ్లాద్ బిసీ..!

Updated Date - 2020-09-27T00:29:17+05:30 IST