కులాంతర వివాహాలకు సుమంగళ్ ద్వారా రూ.2.5 లక్షల ప్రోత్సాహకం

ABN , First Publish Date - 2020-10-28T12:45:17+05:30 IST

కులాంతర వివాహాలు చేసుకునే వారిని ప్రోత్సహించేందుకు ....

కులాంతర వివాహాలకు సుమంగళ్ ద్వారా రూ.2.5 లక్షల ప్రోత్సాహకం

భువనేశ్వర్ (ఒడిశా): కులాంతర వివాహాలు చేసుకునే వారిని ప్రోత్సహించేందుకు ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం కొత్త చర్యలు చేపట్టింది. కులాంతర వివాహాలు చేసుకునేవారు సర్కారు ప్రోత్సాహకం కోసం దరఖాస్తు చేసుకునేందుకు సుమంగళ్ పేరిట ఓ వెబ్‌సైట్‌ను ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రారంభించారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ సుమంగళ్ పోర్టల్ ను అభివృద్ధి చేసింది. కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు ఇచ్చే ప్రోత్సాహకం లక్ష రూపాయల నుంచి రెండున్నర లక్షల రూపాయలకు పెంచామని సీఎం నవీన్ పట్నాయక్ ప్రకటించారు. 


కులాంతర వివాహాలు సామాజిక సామరస్యానికి దోహదపడతాయని సీఎం చెప్పారు. ఉన్నత కులానికి చెందిన హిందువులు షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారిని హిందూ వివాహ చట్టం ప్రకారం వివాహం చేసుకుంటే వన్ టైమ్ ప్రోత్సాహకం అందిస్తామని సర్కారు వెల్లడించింది.మొదటిసారి వివాహం చేసుకున్న వారికి మాత్రమే ఈ గ్రాంట్ ఇస్తామని, అయితే వధువు వితంతువు అయితే వారు ప్రోత్సాహకానికి అర్హులని సర్కారు పేర్కొంది. గతంలో రూ.50వేలున్న అంతర్ కుల వివాహ ప్రోత్సాహకాన్ని 2017లో లక్షరూపాయలకు పెంచింది. ప్రస్థుతం దీన్ని రెండున్నర  లక్షల రూపాయలకు పెంచింది. 

Updated Date - 2020-10-28T12:45:17+05:30 IST