ఒడ్డెన్నకు డీఐఈవోగా పదోన్నతి
ABN , First Publish Date - 2021-03-03T05:06:55+05:30 IST
ఇంటర్మీడియట్ విద్యాశాఖ జిల్లా ఇన్చార్జి అధికారిగా విధులు నిర్వహిస్తున్న దాస రి ఒడ్డెన్న పదోన్నతి పొందారు. హైదరాబాద్ రెగ్యూలర్ డీ ఐఈవోగా ఆయన నియమితులయ్యారు.
నిజామాబాద్అర్బన్, మార్చి 2 : ఇంటర్మీడియట్ విద్యాశాఖ జిల్లా ఇన్చార్జి అధికారిగా విధులు నిర్వహిస్తున్న దాస రి ఒడ్డెన్న పదోన్నతి పొందారు. హైదరాబాద్ రెగ్యూలర్ డీ ఐఈవోగా ఆయన నియమితులయ్యారు. ఆయన స్థానంలో జిల్లా ఇన్చార్జి డీఐఈవోగా కోటగిరి ప్రభుత్వ జూనియర్ క ళాశాల ప్రిన్సిపల్ రఘురాజ్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. పదోన్నతులలో భాగంగా ఒడ్డెన్న డీఐఈవోగా ని యమితులు కావడంతో జిల్లాలో సీనియర్ ప్రిన్సిపల్గా ఉ న్న రఘురాజ్ను ఇన్చార్జి డీఐఈవోగా బాధ్యతలు స్వీకరించారు. బుధవారం హైదరాబాద్ డీఐఈవోగా ఒడ్డెన్న బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా రఘురాజ్ పదోన్నతి పొందిన ఒడ్డెన్నకు శుభాకాంక్షలు తెలిపారు.