అక్టోబర్‌ 5న చెన్నైలో ‘మిస్టర్‌ ఇండియా’ పోటీలు

ABN , First Publish Date - 2022-08-13T15:45:35+05:30 IST

చెన్నైలో ప్రతిష్ఠాత్మక ‘రుబారు మిస్టర్‌ ఇండియా’ పోటీలు జరుగనున్నాయి. అక్టోబరు 5వ తేదీన మిస్టర్‌ ఇండియా ఫైనల్‌ పోటీలు జరుగనున్నా

అక్టోబర్‌ 5న చెన్నైలో ‘మిస్టర్‌ ఇండియా’ పోటీలు

చెన్నై, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): చెన్నైలో ప్రతిష్ఠాత్మక ‘రుబారు మిస్టర్‌ ఇండియా’ పోటీలు జరుగనున్నాయి. అక్టోబరు 5వ తేదీన మిస్టర్‌ ఇండియా ఫైనల్‌ పోటీలు జరుగనున్నాయి. ఈ వివరాలను శుక్రవారం రుబారు మిస్టర్‌ ఇండియా సంస్థ ఉపాధ్యక్షుడు పంకజ్‌ ఖర్బండా చెన్నైలో జరిగిన విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దక్షిణ భారతదేశంలో ఈ ఈవెంట్‌ నిర్వహించడం ఇదే తొలిసారి అని, గతంలో తాము మహారాష్ట్ర, గోవా, ఢిల్లీలో నిర్వహించామన్నారు. ఈ పోటీల కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఔత్సాహికులైన యువకులు తరలివస్తారన్నారు. 2004 నుంచి తాము వరుసగా ఈ పోటీలు నిర్వహిస్తున్నామని వివరించారు. ఈ సమావేశంలో పలువురు మోడళ్లు కూడా పాల్గొన్నారు.

Updated Date - 2022-08-13T15:45:35+05:30 IST