గ్రామ పంచాయతీ స్థలం కబ్జా
ABN , First Publish Date - 2020-10-15T07:21:28+05:30 IST
గ్రామపంచాయతీ స్థలాన్ని కొందరు కబ్జా చేశారని, ఇది సరైంది కాదని ఆలంఖాన్గూడ సర్పంచ్ మౌనికనరేందర్రెడ్డి, గ్రామస్థులు
శంకర్పల్లి: గ్రామపంచాయతీ స్థలాన్ని కొందరు కబ్జా చేశారని, ఇది సరైంది కాదని ఆలంఖాన్గూడ సర్పంచ్ మౌనికనరేందర్రెడ్డి, గ్రామస్థులు బుధవారం అన్నారు. వారు తెలిపిన వివరాల ప్రకా రం.. పంచాయతీకి గతంలో ఈర్లపల్లి నర్సింలు దగ్గర 14 గుంటలు కొన్నారు. దాని ప క్కనే గత సర్పంచ్ సౌమ్య వెంకటేష్ ప్లాట్లను కొని పంచాయతీ స్థలం నుంచి రోడ్డును వేశారు. దీంతో గ్రామస్థులు పంచాయతీ స్థలాన్ని తిరిగి ఇవ్వాలని జెడ్పీటీసీ గోవిందమ్మగోపాల్రెడ్డి, గుడిమల్కాపూర్ ఏఎంసీ మాజీ చైర్మన్ వెంకటరెడ్డి సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. అయినా మా జీ సర్పంచ్ వినలేదని సర్పంచ్ తెలిపారు. కబ్జాదారు తాము దళితులమంటూ భయభ్రాంతులకు గురిచేయడం సరికాదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థలాన్ని పంచాయతీకి అప్పగించకుంటే కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని వారు పేర్కొన్నారు.