ఓబులవారిపల్లెలో దారుణం..

ABN , First Publish Date - 2020-09-29T15:37:11+05:30 IST

అనంతపురం: కదిరి నియోజకవర్గం తలుపుల మండలం ఓబులవారిపల్లెలో దారుణం చోటు చేసుకుంది.

ఓబులవారిపల్లెలో దారుణం..

అనంతపురం: కదిరి నియోజకవర్గం తలుపుల మండలం ఓబులవారిపల్లెలో దారుణం చోటు చేసుకుంది. దళిత సామాజిక వర్గానికి చెందిన కుటుంబంపై అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ప్రాణ భయంతో కదిరి పట్టణంలోని ఓ లాడ్జిలో కుటుంబ సభ్యులు తలదాచుకున్నారు. దాడి చేసిన వారి వెనుక అధికార పార్టీ నేతలు ఉన్నారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నేతల ప్రోద్బలంతో విచక్షణా రహితంగా తమపై దాడి చేస్తున్నారంటూ కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు.

Updated Date - 2020-09-29T15:37:11+05:30 IST