చంద్రబాబు చిత్తూరు పర్యటనను అడ్డుకోవడం దుర్మార్గపు చర్య
ABN , First Publish Date - 2021-03-02T05:08:15+05:30 IST
టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు చిత్తూరు పర్యటనను పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గపు చర్య అని టీడీపీ కడప పార్లమెంట్ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి పేర్కొన్నారు.
ప్రొద్దుటూరు క్రైం, మార్చి 1 : టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు చిత్తూరు పర్యటనను పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గపు చర్య అని టీడీపీ కడప పార్లమెంట్ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి పేర్కొన్నారు. సో మవారం ఆయన తన కార్యాలయంలో విలేఖరులతో మా ట్లాడుతూ తిరుపతి బస్టాండులోని ప్రైవేట్ స్థలంలో దుకా ణం నడుపుకుంటున్న మహిళ ఎన్నికల్లో నామినేషన్ ఉప సంహరణ చేసుకోలేదని, ఆమె షాపును పగులగొట్టడాన్ని ఖండిస్తూ ఆమెను పరామర్శించేందుకు వచ్చిన చంద్రబాబునాయుడును తిరుపతి ఎయిర్పోర్టులో పోలీసులు అడ్డుకోవడం అధికార వైసీపీ అధికార దుర్వినియోగానికి నిదర్శనమన్నారు. ప్రతిపౌరునికి ఎక్కడైనా పర్యటించే హక్కు ఉందని, అలాంటి హక్కు చంద్ర బాబుకు లేదా అని ప్రశ్నించారు. సమావేశంలో పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు.