గౌరవెళ్లి ప్రాజెక్టు పనులను అడ్డుకున్న నిర్వాసితులు

ABN , First Publish Date - 2020-07-10T20:42:13+05:30 IST

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా జిల్లాలోని అక్కన్నపేట మండలంలో నిర్మించ తలపెట్టిన గౌరవెళ్లి ప్రాజెక్టు పనులను భూ నిర్వాసితులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, నిర్వాసితులకు మధ్య

గౌరవెళ్లి ప్రాజెక్టు పనులను అడ్డుకున్న నిర్వాసితులు

సిద్దిపేట: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా జిల్లాలోని అక్కన్నపేట మండలంలో నిర్మించ తలపెట్టిన గౌరవెళ్లి ప్రాజెక్టు పనులను భూ నిర్వాసితులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, నిర్వాసితులకు మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో గుడాటిపల్లి సర్పంచ్‌కు గాయాలయ్యాయి. దీంతో మరింత ఆగ్రహానికి గురైన నిర్వాసితులు గౌరవెళ్లి-కుందనవానిపల్లి రోడ్డును మూసివేశారు. ప్రాజెక్టులను పనులను అడ్డుకుని రోడ్డుపైనే బైటాయించారు.

Updated Date - 2020-07-10T20:42:13+05:30 IST