ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ పరిశీలన
ABN , First Publish Date - 2022-05-21T04:37:12+05:30 IST
ప్రొద్దుటూరు ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ను జాయింట్ కలెక్టర్ సాయికాంత్ వర్మ పరిశీలించారు.
వసతుల ఏర్పాటుపై సమీక్షించిన జేసీ
ప్రొద్దుటూరు అర్బన్ మే 20: ప్రొద్దుటూరు ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ను జాయింట్ కలెక్టర్ సాయికాంత్ వర్మ పరిశీలించారు. వసతులపై కలెక్టర్ విజయరామరాజు ఆదేశాల మేరకు ఇక్కడ గెస్ట్ హౌస్ను పరి శీలించేందుకు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. శుక్రవారం మధ్యా హ్నం తనిఖీ చేసిన అనంతరం ఆర్అండ్బీ గెస్ట్ హౌస్లో ఫర్నీచర్ సరిగాలేదని మరుగుదొడ్లు నిర్వహణ సరిగాలేదని, ప్రహరీ నిర్మాణం చేపట్టలేదని పారిశుధ్యం అధ్వాన్నంగా వుందని ఆర్అండ్బీ, మున్సిప ల్ అధికారులను ప్రశ్నించారు. ప్రహరీ నిర్మాణం వెంటనే చేపట్టాలని ఆదేశించారు. రోడ్లమీద వర్షం నీళ్ళు నిల బడకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ రమణయ్యను జెసీ ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్అండ్బీ ఎస్ఈ, ఈఈ, డీఈలు పాల్గొన్నారు.