మిషన్ భగీరథ పనుల పరిశీలన
ABN , First Publish Date - 2020-10-01T10:36:30+05:30 IST
నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని గాంధీనగర్, సీసీసీ, రాజీవ్నగర్, తెలంగాణ నగర్, సంతోష్నగర్, చాపల మార్కెట్ ఏరియాల్లో మిషన్ భగీరథ
నస్పూర్. సెప్టెంబరు 30 : నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని గాంధీనగర్, సీసీసీ, రాజీవ్నగర్, తెలంగాణ నగర్, సంతోష్నగర్, చాపల మార్కెట్ ఏరియాల్లో మిషన్ భగీరథ పనులను బుధవారం మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్ పరిశీలించారు. ఇంటింటికి గోదావరి నీరు అందే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. ట్యాంకు, పైపులైన్ పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఇంటింటికి నల్లా కనెక్షన్లను ఇవ్వడం త్వరగా చేపట్టాలన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ ప్రకాష్, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ అబ్రహం, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు వంగ తిరుపతి, నాయకులు హైమద్, అశోక్, దగ్గుల మధుకర్, గరిసె భీమయ్య, వడ్లూరి రవి, రవిగౌడ్, స్థానికులు పాల్గొన్నారు.