కొత్త జీతాలపై అభ్యంతరం

ABN , First Publish Date - 2022-01-28T05:09:53+05:30 IST

కర్నూలు మెడికల్‌ కాలేజీలో ఉద్యోగుల జీతాలు పాస్‌ చేస్తున్న ప్రయత్నాలపై ఏపీ పీఆర్‌సీ సాధన సమితి నాయకులు అభ్యంతరం తెలిపారు.

కొత్త జీతాలపై అభ్యంతరం
కళాశాలలో వాదనకు దిగిన పీఆర్‌సీ సాధన సమితి నాయకులు

కర్నూలు(హాస్పిటల్‌), జనవరి 27: కర్నూలు మెడికల్‌ కాలేజీలో ఉద్యోగుల జీతాలు పాస్‌ చేస్తున్న ప్రయత్నాలపై ఏపీ పీఆర్‌సీ సాధన సమితి నాయకులు అభ్యంతరం తెలిపారు. గురువారం సాయంత్రం కాలేజీలో ఏపీ పీఆర్‌సీ సాధన సమితి నాయకులు జవహర్‌లాల్‌, ఏపీజీఏ జిల్లా అధ్యక్షుడు ఎంసీ నరసింహులు, ఏపీజీఎప్‌ జిల్లా అధ్యక్షుడు రఘుబాబు, ప్రభుత్వ డ్రైవర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరావు, ఏడీ చాంబర్‌ను చేరుకుని ఎట్టి పరిస్థితుల్లో కొత్త వేతనాలు చేయడానికి వీలులేదని తెలిపారు. కొత్త పీఆర్‌సీ ప్రకారం ఉద్యోగుల వేతనాలకు ఒప్పుకోమని, బిల్లులు ప్రాసెస్‌ చేయటాన్ని పూర్తిగా వ్యతిరేకించారు. ఉద్యోగి ఆప్షన్‌ తీసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లో కొత్త వేతనాలు చేయడానికి వీల్లేదని చెప్పారు.

Updated Date - 2022-01-28T05:09:53+05:30 IST