ఎంబీబీఎస్ కౌన్సెలింగ్లో ఓబీసీలకు అన్యాయం: ఓబీసీ ఫెడరేషన్
ABN , First Publish Date - 2021-07-27T08:50:33+05:30 IST
ఎంబీబీఎస్ కౌన్సెలింగ్లో ఓబీసీలకు అన్యాయం: ఓబీసీ ఫెడరేషన్
న్యూఢిల్లీ, జూలై 26(ఆంధ్రజ్యోతి): వైద్య విద్య ప్రవేశాలలో ఓబీసీలకు అన్యాయం జరుగుతోందని, ఎంబీబీఎస్ కౌన్సెలింగ్లో ఓబీసీలకు జరిగిన అన్యాయంపై పార్లమెంటు సమావేశాలలో ప్రస్తావించి తమకు న్యాయం చేయాలని ఓబీసీ షెడరేషన్ జాతీయ కార్యదర్శి, నంద్యాల పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జే. లక్ష్మీనరసింహ యాదవ్ ఎంపీలకు విజ్ఞప్తి చేశారు. ఉత్తరప్రదేశ్ రాజ్యసభ సభ్యుడు హెచ్. శుక్రంసింగ్ యాదవ్, కేరళ ఎంపీ, కాంగ్రెస్ పార్లమెంటరీపార్టీ కార్యదర్శి సీహెచ్. కే. సురేశ్ను సోమవారం కలిసి ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు.