పెట్రోల్‌, డిజిల్‌పై వ్యాట్‌ తగ్గించాలని ధర్మపురిలో బీజేవైఎం నిరసన

ABN , First Publish Date - 2021-12-02T06:16:58+05:30 IST

పెట్రోల్‌, డిజిల్‌పై వ్యాట్‌ తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ ధర్మపురి మండల కేంద్రంలో బీజేవైఎం ఆధ్వర్యంలో కార్యకర్తలు బుధవారం ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు.

పెట్రోల్‌, డిజిల్‌పై వ్యాట్‌ తగ్గించాలని  ధర్మపురిలో బీజేవైఎం నిరసన
ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేస్తున్న బీజేవైఎం నాయకులు

ధర్మపురి, డిసెంబరు 1: పెట్రోల్‌, డిజిల్‌పై వ్యాట్‌ తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ ధర్మపురి మండల కేంద్రంలో బీజేవైఎం ఆధ్వర్యంలో కార్యకర్తలు బుధవారం ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కార్యకర్తలు కాషాయ జెండాలు చేత పట్టుకుని ధర్మపురి  చేరుకున్నారు. అనంతరం నంది చౌక్‌, వివిధ కళాశాలల వద్ద ప్లకార్డులు చేతపట్టుకుని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. రాష్ట్రంలో పెట్రోల్‌, డిజిల్‌ పై వ్యాట్‌ తగ్గించాలని లేనియెడల ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం పట్టణ అధ్యక్షులు గాజు భాస్కర్‌, ప్రధాన కార్యదర్శి మండలోజు సూరజ్‌, బాకి అనిల్‌, నరెడ్ల శంకర్‌, కోరుగంటి కిరణ్‌, శేఖర్‌, వంశీ, నాగులు, నర్సింహులు, శ్రీనివాస్‌, నవీన్‌, మనోజ్‌, వరుణ్‌, రాజశేఖర్‌, రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-02T06:16:58+05:30 IST