మిమ్మల్ని నేనే తొలగిస్తున్నా: Ops ప్రకటన

ABN , First Publish Date - 2022-07-12T13:42:37+05:30 IST

అన్నాడీఎంకే పార్టీ నుంచి తనను బహిష్కరించే అధికారం ఎడప్పాడి పళనిస్వామికి లేదని ఒ.పన్నీర్‌సెల్వం ప్రకటించారు. సోమవారం ఉదయం

మిమ్మల్ని నేనే తొలగిస్తున్నా: Ops ప్రకటన

చెన్నై, జూలై 11 (ఆంధ్రజ్యోతి): అన్నాడీఎంకే పార్టీ నుంచి తనను బహిష్కరించే అధికారం ఎడప్పాడి పళనిస్వామికి లేదని ఒ.పన్నీర్‌సెల్వం ప్రకటించారు. సోమవారం ఉదయం రాయపేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం వద్ద ఆయన విలేఖరులతో మాట్లాడుతూ పార్టీలోని ఒకటిన్నర కోట్ల మంది శ్రేణులు తనను సమన్వయకర్తగా ఎన్నుకున్నారని, తనను తొలగించేందుకు ఈపీఎస్‏కుగానీ, కేపీ మునుస్వామికి గానీ అధికారం లేదని అన్నారు. తాను పార్టీకి సమన్వయకర్తనని పేర్కొంటూ.. తానే వారిని తొలగిస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు ఈపీఎస్‏ను, కేపీ మునుస్వామిని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. తన తరఫు న్యాయం కోసం మళ్ళీ కోర్టును ఆశ్రయించి అప్పీలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. సమావేశంలో శాసనసభ్యులు వైద్యలింగం, మనోజ్‌పాండ్యన్‌, పుగళేంది. ముత్యాల్‌పేట ఆర్‌వి రంజిత్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-12T13:42:37+05:30 IST