నూజివీడు రెండో వైస్‌ చైర్మన్‌గా పగడాల సత్యనారాయణ

ABN , First Publish Date - 2021-07-31T06:02:07+05:30 IST

నూజివీడు రెండో వైస్‌ చైర్మన్‌గా పగడాల సత్యనారాయణ

నూజివీడు రెండో వైస్‌ చైర్మన్‌గా పగడాల సత్యనారాయణ
వైస్‌ చైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేస్తున్న పగడాల సత్యనారాయణ

నూజివీడు: పురపాలక సంఘం రెండో వైస్‌ చైర్మన్‌గా పగడాల సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారి, ఆర్డీవో రాజ్యలక్ష్మి రెండో వైస్‌ చైర్మన్‌ ఎంపిక ప్రక్రియను శుక్రవారం నిర్వహించారు. పగడాలను 16వ వార్డు కౌన్సిలర్‌ శీలం రామయ్య ప్రతిపాదించగా, 32వ వార్డు కౌన్సిలర్‌ నడువు నాగమల్లేశ్వరావు బలపరిచారు. పోటీలో ఇంకెవరూ లేకపోవటంతో పగడాల సత్యనారాయణ రెండో వైస్‌ చైర్మన్‌గా ఎన్నికైనట్లు ఆర్డీవో ప్రకటించి, ప్రమాణస్వీకారం చేయించారు. నూజివీడును రాష్ట్రంలో ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దేలా పని చేయాలని ఎమ్మెల్యే మేకా ప్రతాప్‌ అప్పారావు సూచించారు. ఎమ్మెల్యేను కౌన్సిల్‌ సభ్యులు ఘనంగా సన్మానించారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రామిశెట్టి త్రివేణిదుర్గ, వైస్‌ చైర్మన్‌ అమీరున్నీసా బేగం, కమిషనర్‌ సయ్యద్‌ అబ్దుల్‌ రషీద్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-31T06:02:07+05:30 IST