పౌష్ఠికాహారం అందజేయాలి
ABN , First Publish Date - 2021-09-29T05:58:45+05:30 IST
అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్ఠికాహారం అందజేయాలని జిల్లా సంక్షేమ అధికారి జ్యోతి పద్మ అన్నారు. పోష ణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా జనగాం క్రాస్రోడ్డులో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. పౌష్టికాహారంతో పోషణ లోపం లేకుండా నివారించాలన్నారు. టీ-సాట్ను వినియోగించుకుని, అంగన్వాడీ కేంద్రాల
సూర్యాపేటరూరల్, సెప్టెంబరు 28: అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్ఠికాహారం అందజేయాలని జిల్లా సంక్షేమ అధికారి జ్యోతి పద్మ అన్నారు. పోష ణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా జనగాం క్రాస్రోడ్డులో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. పౌష్టికాహారంతో పోషణ లోపం లేకుండా నివారించాలన్నారు. టీ-సాట్ను వినియోగించుకుని, అంగన్వాడీ కేంద్రాల నిర్వహణపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. యోగాతో కలిగే లాభాలపై విసృతంగా ప్రచారం చేయాలని అంగన్వాడీ టీచర్లకు సూ చించారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జడ్పీటీసీలు, జీడీ భిక్షం, మామిడి అనిత, వైస్ఎంపీపీ శ్రీనివా్సనాయుడు, సీడీపీవో కిరణ్మయి, పోషణ్ అభియాన్ కోఆర్డినేటర్ సంపత్ పాల్గొన్నారు.