నర్సరీ సంఘం ఎన్నికలకు ప్రణాళికలు

ABN , First Publish Date - 2021-04-17T05:16:48+05:30 IST

కడియంలో నర్సరీ సంఘం ఎన్నికలకు నర్సరీ ప్రతినిధులు ప్రణాళికలు చేస్తున్నారు.

నర్సరీ సంఘం ఎన్నికలకు ప్రణాళికలు

కడియం, ఏప్రిల్‌ 16: కడియంలో నర్సరీ సంఘం ఎన్నికలకు నర్సరీ ప్రతినిధులు ప్రణాళికలు చేస్తున్నారు. కడియపులంక గ్రామంతోపాటు మండలంలో సుమారు 2 వేల చిన్న, పెద్ద నర్సరీలున్నాయి. కడియం సర్‌ఆర్ధర్‌ కాటన్‌ నర్సరీ అసోసియేషన్‌ ఎన్నికలు ఈనెల 25, లేదా వచ్చే నెల 2వ తేదీన నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో ఎన్నికలకు అనుమతి కోరుతూ తహశీల్దారు జి.భీమారావు, సీఐ కె.శ్రీధర్‌కుమార్‌లకు వినతిపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఆలిండియా నర్సరీ సంఘం మాజీ అధ్యక్షుడు పల్ల సుబ్రహ్మణ్యం, మాజీ డైరెక్టర్‌ మార్గాని సత్యనారాయణ, కడియం సర్‌ఆర్ధర్‌ కాటన్‌ నర్సరీ సంఘం ఉపాధ్యక్షుడు కొత్తపల్లి శివాజీ, కార్యదర్శి బొర్సు సుబ్బారాయుడు, వలంటరీ కమిటీ సభ్యుడు మల్లు పోలరాజు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-17T05:16:48+05:30 IST