ఏలూరు మేయర్ రేసులో నూర్జహాన్ బేగం!

ABN , First Publish Date - 2021-07-25T17:57:04+05:30 IST

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో...

ఏలూరు మేయర్ రేసులో నూర్జహాన్ బేగం!

ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 50 డివిజన్ వైసీపీ అభ్యర్థి, మాజీ మేయర్ నూర్జహాన్ బేగం విజయం సాధించారు. ప్రత్యర్థిపై 570 ఓట్లు ఆధిక్యతతో గెలుపొందారు. కాగా.. రెండోసారి మేయర్ అభ్యర్ధిగా నూర్జహాన్ బేగం రేసులో ఉన్నారు. బేగం గెలుపుతో అభిమానులు, కార్యకర్తలు, అనుచరులు ఆనందంలో మునిగితేలుతున్నారు. నూర్జహాన్ ఇంటి దగ్గర, పార్టీ కార్యాలయం ముందు అభిమానులు స్వీట్లు పంచుకుని, పటాసులు పేల్చుతున్నారు. కాగా.. ఈ నెల 30న ఏలూరు మేయర్, ఇద్దరు డిప్యూటీ మేయర్ల ఎన్నికలకి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం విదితమే. ఇప్పటి వరకూ 38, 39, 41, 42, 46 డివిజన్లలో వైసీపీ విజయం విజయం సాధించింది. అయితే.. ఎన్నికల్లో పోటీ చేసిన ఇద్దరు వైసీపీ అభ్యర్థులు ఇవాళ జరిగిన కౌంటింగ్‌లో గెలుపొందగా.. అనారోగ్యంతో కొన్ని రోజుల క్రితమే మరణించారు. ఆ రెండు డివిజన్లలో ఉప ఎన్నిక జరగనుంది.

Updated Date - 2021-07-25T17:57:04+05:30 IST