ఉన్నత విద్య కోసం బ్రిటన్ వైపు భారతీయుల పరుగులు!

ABN , First Publish Date - 2022-02-17T22:33:22+05:30 IST

ఉన్నత విద్య కోసం భారతీయ విద్యార్థులు బ్రిటన్‌ వైపు చూస్తున్నారు. ఈ విషయాన్ని తాజాగా వెల్లడైన గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో అకాడమిక్ సెషన్ ప్రారంభమవుతున్న

ఉన్నత విద్య కోసం బ్రిటన్ వైపు భారతీయుల పరుగులు!

ఎన్నారై డెస్క్: ఉన్నత విద్య కోసం భారతీయ విద్యార్థులు బ్రిటన్‌ వైపు చూస్తున్నారు. ఈ విషయాన్ని తాజాగా వెల్లడైన గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో అకాడమిక్ సెషన్ ప్రారంభమవుతున్న తరుణంలో.. యూకేలోని యూనివర్సిటీల్లో అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో చేరేందుకు భారతీయుల నుంచి పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయని యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ అడ్మిషన్స్ సర్విస్(యూసీఏఎస్) ఓ ప్రకనటలో తెలిపింది. 2021లో 7,830 మంది దరఖాస్తు చేసుకోగా.. ఈ ఏడాది ఈ సంఖ్య 8,660కి చేరినట్టు వెల్లడించింది. 2019తో పోల్చితే ఈ ఏడాది రెట్టింపు అప్లికేషన్లు అందినట్టు పేర్కొంది. 2019లో కేవలం 4,690 దరఖాస్తులను మాత్రమే అందుకున్నట్టు తెలిపింది. బ్రిటన్‌లో విద్యాభ్యాసం చేసేందుకు చైనా తర్వాత భారతీయులే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్టు చెప్పింది. కాగా.. ఉన్నత విద్యకు బ్రిటన్ గమ్యస్థానంగా మారిందనడానికి భారత్ నుంచి వచ్చిన అప్లికేషన్లే నిదర్శనమని యూసీఏఎస్ ఇంటర్నేషనల్ ఎండీ డెస్ కట్చే అభిప్రాయపడ్డారు. 




Updated Date - 2022-02-17T22:33:22+05:30 IST