దేశంలో బిలియనీర్ల సంఖ్య తగ్గింది: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

ABN , First Publish Date - 2021-08-11T02:04:12+05:30 IST

2019 నుంచి 2021 మధ్యకాలంలో భారత బిలియనీర్ల సంఖ్య తగ్గిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా పార్లమెంట్‌కు తెలిపారు.

దేశంలో బిలియనీర్ల సంఖ్య తగ్గింది: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

న్యూఢిల్లీ: 2019 నుంచి 2021 మధ్యకాలంలో భారత బిలియనీర్ల సంఖ్య తగ్గిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా పార్లమెంట్‌కు తెలిపారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో దేశంలో కుబేరుల సంఖ్య 141గా ఉండేదని, 2020-21 నాటికి వీరి సంఖ్య 136కు చేరుకుందని మంత్రి పేర్కొన్నారు. ఆదాయపు పన్ను రిటర్నుల్లో వారు ప్రస్తావించిన స్థూల ఆదాయం ఆధారంగా ఈ అంచనాకు వచ్చామన్నారు. ‘‘వెల్త్ ట్యాక్స్‌ రద్దయిన కారణంగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డ్(సీబీడీటీ) వద్ద వ్యక్తుల సంపదపై పూర్తి వివరాలు అందుబాటులో లేవు. సీబీడీటీ ప్రకారం.. బిలియనీర్ పదాన్ని చట్టాల్లో గానీ, ప్రభుత్వ మార్గదర్శకాల్లోగానీ ఎక్కడా నిర్వచించలేదు.’’ అని మంత్రి పేర్కొన్నారు. 

Updated Date - 2021-08-11T02:04:12+05:30 IST