భూ బెదిరింపులతో జెండా మార్చేసిన టీడీపీ అభ్యర్థి
ABN , First Publish Date - 2021-03-04T08:53:41+05:30 IST
నూజివీడు పురపాలక పోరులో ఓ టీడీపీ అభ్యర్థి బుధవారం రాత్రి వైసీపీలోకి చేరిపోయారు. రెండో వార్డులో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఎ
నూజివీడు, మార్చి 3: నూజివీడు పురపాలక పోరులో ఓ టీడీపీ అభ్యర్థి బుధవారం రాత్రి వైసీపీలోకి చేరిపోయారు. రెండో వార్డులో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఎదురేశి ఎరకయ్యను వైసీపీ స్థానిక నాయకులు బెదిరించారు. ఏడెకరాల భూమి వ్యవహారాన్ని బూచిగా చూపి, పోటీ నుంచి విరమించకోకపోతే నీ పనిపడతాం..’ అని హెచ్చరించారు. బుధవారం సాయంత్రం నామినేషన్లు ఉపసంహరణ గడువు ముగిసే వరకు ఎరకయ్యను టీడీపీ నేతలు బయటకు వదలకుండా ధైర్యం చెప్పారు. సాయంత్రం 5 గంటలకు ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి టీడీపీ నేతల నుంచి బయటపడిన ఎరకయ్య.. సాయంత్రం 7 గంటలకు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు కార్యాలయానికి వెళ్లి, ఎమ్మెల్యే సమక్షంలో పచ్చ చొక్కాపైనే వైసీపీ కండువా వేసుకున్నారు.