షాక్‌కు గురైన 14 ఏళ్ల బాలిక.. వారం రోజులుగా తిండి, నిద్రకు దూరం.. విషయం ఏంటని ఆరా తీస్తే..

ABN , First Publish Date - 2022-04-30T22:21:23+05:30 IST

ఆ బాలిక వయసు 14 ఏళ్లు.. స్నేహితురాళ్లతో కలిసి సరదాగా ఆడుతూ పాడుతూ గడిపేది..

షాక్‌కు గురైన 14 ఏళ్ల బాలిక.. వారం రోజులుగా తిండి, నిద్రకు దూరం.. విషయం ఏంటని ఆరా తీస్తే..

ఆ బాలిక వయసు 14 ఏళ్లు.. స్నేహితురాళ్లతో కలిసి సరదాగా ఆడుతూ పాడుతూ గడిపేది.. అలాంటిది వారం రోజుల నుంచి నిశ్శబ్దంగా ఉంటోంది.. తిండికి, నిద్రకూ దూరమైంది.. రాత్రిపూట ఏడుస్తోంది.. విషయం ఏంటని ఆరా తీస్తే నాలుగు రోజుల తర్వాత చెప్పింది.. స్విమ్మింగ్‌కు వెళ్లినపుడు బాత్రూమ్‌లో స్నానం చేస్తుండగా ఒక స్నేహితుడు తనను నగ్నంగా వీడియో తీశాడని, దానిని చూపించి బెదిరిస్తున్నాడని ఆమె తల్లికి చెప్పింది.. దీంతో ఆ మహిళ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. 


రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఓ ప్రతిష్టాత్మక క్లబ్‌కు ఆ బాలిక తన స్నేహితులతో కలిసి స్విమ్మింగ్ కోసం వెళ్లింది. స్విమ్మింగ్ అయిపోయిన తర్వాత బాత్రూమ్‌లో స్నానం చేసింది. ఆ బాత్రూమ్ షవర్‌లో ఆ బాలిక స్నేహితుడు అప్పటికే మొబైల్‌ను అమర్చాడు. ఆ బాలిక స్నానం చేసి దుస్తులు మార్చుకుంటున్న దృశ్యాన్ని వీడియో తీశాడు. అనంతరం ఆ వీడియో చూపించి ఆ బాలికను బెదిరించడం ప్రారంభించాడు. తీవ్రంగా భయపడిపోయిన ఆ బాలిక షాక్‌కు గురైంది. 


తల్లిదండ్రులకు కూడా విషయం చెప్పకుండా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. వారం రోజులుగా తిండికి, నిద్రకు దూరమైంది. నాలుగు రోజుల తర్వాత తల్లికి మొత్తం విషయం చెప్పింది. దీంతో బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ విషయంలో బాధితురాలి కుటుంబానికి, నిందితుడికి మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించిన క్లబ్ యాజమాన్యంపై కూడా కేసు నమోదు చేశారు. 

Updated Date - 2022-04-30T22:21:23+05:30 IST