నడిరోడ్డు మీద యువకుడిని నగ్నంగా మార్చి దేహశుద్ధి చేసిన మహిళ.. ఆమె ఆగ్రహానికి కారణమేంటో తెలిస్తే..

ABN , First Publish Date - 2022-02-09T19:03:42+05:30 IST

ఆ మహిళ వేరే ఊరు వెళ్లేందుకు బస్టాప్ వద్ద నిల్చుని ఉంది.. ఆమె ఒంటరిగా ఉండడంతో ఓ యువకుడు ఆమెను వేధించాడు..

నడిరోడ్డు మీద యువకుడిని నగ్నంగా మార్చి దేహశుద్ధి చేసిన మహిళ.. ఆమె ఆగ్రహానికి కారణమేంటో తెలిస్తే..

ఆ మహిళ వేరే ఊరు వెళ్లేందుకు బస్టాప్ వద్ద నిల్చుని ఉంది.. ఆమె ఒంటరిగా ఉండడంతో ఓ యువకుడు ఆమెను వేధించాడు.. ఆమె చెయ్యి పట్టుకుని లాగాడు.. అసభ్యంగా ప్రవర్తించాడు.. తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ మహిళ తన కుటుంబ సభ్యులను, గ్రామస్థులను తీసుకుని ఆ యువకుడి ఇంటికి వెళ్లింది.. అతడిని ఇంటి నుంచి బయటకు లాగేసి చితక్కొట్టింది.. నగ్నంగా మార్చి ఊరేగించింది.. మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో ఈ ఘటన జరిగింది. 


ఈ నెల 5వ తేదీన బాధిత మహిళ ధార్ నుంచి ఓల్డ్ నిసార్‌పూర్ వెళ్తుండగా శివమ్ పటేదార్ అనే యువకుడు ఆమెను వేధింపులకు గురి చేశాడు. చెయ్యి పట్టుకుని లాగి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆ మహిళ వెంటనే తన గ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యులను, గ్రామస్థులను తీసుకుని శివమ్ ఇంటికి వెళ్లింది. ఇంటి నుంచి బయుటకు లాగి నడిరోడ్డు మీద అతడిని చితక్కొట్టింది. అనంతరం అతడిని నగ్నంగా మార్చి ఊరేగించింది. కొందరు ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 


తాజాగా ఇరు వర్గాల వారు స్థానిక పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేశారు. పోలీసులు ఇరు వర్గాల వారిపై కేసులు నమోదు చేశారు. విచారణ పూర్తయిన తర్వాత చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.  

Updated Date - 2022-02-09T19:03:42+05:30 IST