పేదల బతుకులు మార్చిన మహనీయుడు ఎన్టీఆర్
ABN , First Publish Date - 2021-01-19T06:41:36+05:30 IST
తెలుగుదేశం పార్టీని స్థాపించి అధికా రంలోకి తీసుకొచ్చి పేదల బతుకులు మార్చిన మహనీయుడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు అని తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజారెడ్డి అన్నారు.
ఆదిలాబాద్టౌన్, జనవరి 18: తెలుగుదేశం పార్టీని స్థాపించి అధికా రంలోకి తీసుకొచ్చి పేదల బతుకులు మార్చిన మహనీయుడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు అని తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజారెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్చౌక్లో ఎన్టీఆర్ 25వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ పేదల కోసం పార్టీ స్థాపించి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎండీ రఫీ, భూమన్న, ఆకుల రాము, పతిహార ప్రభాకర్, స్వామి తదితరులున్నారు.
ఉట్నూర్: స్వర్గీయ ఎన్టీఆర్ వర్ధంతిని సోమవారం టీడీపీ నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎన్టీఆర్ చౌరస్తాలోని విగ్రహానికి ఎస్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పవార్ దేవిదాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి రాజేశ్వర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కోల అశోక్, షేక్ మాలిక్బాయ్, మక్భూల్, చిత్రు తదితరులు పాల్గొన్నారు.
ఇచ్చోడ: మండల కేంద్రంలో ఎన్టీఆర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. సోమవారం టీడీపీ కార్యకర్తలు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అన్ని వర్గల ప్రజల అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందని జిల్లా అధికార ప్రతినిధి రేసు పోతారెడ్డి అన్నారు. ఇందులో కన్వీనర్ బొజ్జ లక్ష్మణ్, ఎస్కే వలి, మహబూబ్ఖాన్, గట్టు మహేందర్, నర్సయ్య ఉన్నారు.