ఎన్టీఆర్‌ సేవలు మరువలేనివి

ABN , First Publish Date - 2020-05-29T10:50:10+05:30 IST

తెలుగు రాష్ర్టాల అభివృద్ధికి దివంగత ముఖ్య మంత్రి ఎన్టీ రామారావు కృషి చేశారని టీడీపీ పెద్దపల్లి

ఎన్టీఆర్‌ సేవలు మరువలేనివి

మంచిర్యాల అర్బన్‌,  మే 28 : తెలుగు రాష్ర్టాల అభివృద్ధికి దివంగత ముఖ్య మంత్రి ఎన్టీ రామారావు కృషి చేశారని టీడీపీ పెద్దపల్లి పార్లమెంట్‌ అధ్యక్షుడు బి. సంజయ్‌కుమార్‌ అన్నారు. గురువారం ఎన్టీఆర్‌ జయంతి వేడుకలను లక్ష్మి థియే టర్‌ చౌరస్తాలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేసి జెండావిష్కరణ చేశారు.


దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ సేవలు చిరస్మరణీయమైనవని కొనియాడారు. బడుగు, బలహీన వర్గాలు, కార్మికులు, కర్షకులు, మహిళల అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. సింగరేణిలో ఉద్యోగ సమస్యలను పరిష్కరించేందుకు, పరుగుపందెంతో యువతకు బొగ్గుగనుల లో ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఆయనదేనన్నారు. నాయకులు సాగర్‌, సమ్మయ్య, బైరాజ్‌ శ్రీనివాస్‌, సురేష్‌, శ్రీనివాస్‌, శ్రీకాంత్‌, శేఖర్‌, విష్ణువర్ధన్‌రావు, రామాం జనేయులు, వడ్డె వినయ్‌కుమార్‌ పాల్గొన్నారు. 


బెల్లంపల్లిటౌన్‌: మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్‌ టీ రామారావు ఆశయాల సాధనకు టీడీ పీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పార్టీ పట్టణ అధ్యక్షుడు టి మణిరాంసింగ్‌ తెలిపారు. కార్యాలయంలో పార్టీ జెండాను ఎగురవేసిన నాయకులు ఎన్‌టీఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.  రాజ్‌కుమార్‌పాండె, జీవరత్నం, మద్దెల రాజనర్సు, ఎండి గౌస్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-29T10:50:10+05:30 IST