విజయవాడ: ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీకి చెందిన రూ.400 కోట్లు ప్రభుత్వ చేతుల్లోకి వెళ్లాయి. ప్రభుత్వ ఫైనాన్షియల్ సర్వీస్ కార్పొరేషన్లోకి డబ్బుల బదిలీ ప్రక్రియ పూర్తయింది. బ్యాంకు అధికారులతో వీసీ సమావేశం అయ్యారు. వీసీ తీరుపై యూనివర్శిటీ ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. వీసీ చాంబర్లో బైఠాయించాయి. వీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. తమ బాస్ చెప్పినట్లే వింటానన్న వీసీ వ్యాఖ్యలపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపటి నుంచి జేఏసీగా ఏర్పడి ఆందోళన చేయాలని ఉద్యోగులు నిర్ణయించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవో 25 ద్వారా బ్యాంకుల్లోని ప్రభుత్వ రంగ సంస్థల డిపాజిట్లకు రక్షణ లేదన్నారు. యూనివర్సిటీ నిధులు రూ.448 కోట్లను కష్టపడి కూడేశామన్నారు. వీటిలో రూ.400 కోట్లు ప్రభుత్వ కొత్త సంస్థకు ఏకపక్షంగా వీసీ బదిలీ చేశారని ఉద్యోగులు ఆరోపించారు.