AP: యోగానంద లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో దారుణం

ABN , First Publish Date - 2022-04-27T13:57:42+05:30 IST

జిల్లాలోని జగ్గయ్యపేట మండలంలో గల వేదాద్రి శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామివారి దేవాలయంలో దారుణం జరిగింది.

AP: యోగానంద లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో దారుణం

ఎన్టీఆర్: జిల్లాలోని జగ్గయ్యపేట మండలంలో గల వేదాద్రి శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామివారి దేవాలయంలో దారుణం జరిగింది. సెల్‌ఫోన్ పోయిందంటూ గుడికి సంబంధించిన సీసీఫుటేజ్ ఇవ్వాల్సిందిగా ఉద్యోగులను మాలధారులు కోరారు. అయితే పుటేజికి సంబంధించిన ఉద్యోగి రాలేదని వచ్చిన అనంతరం ఇస్తామని సిబ్బంది తెలిపారు. దీంతో సీసీ పూటేజీ ఇవ్వరా అంటూ ఆగ్రహంతో దేవాలయ కార్యాలయానికి, టిక్కెట్లు అమ్మే కౌంటర్‌కు మాలాధారులు తాళాలు వేశారు. ఆఫీసులో మహిళా ఉద్యోగితో పాటు కౌంటర్‌లో టిక్కెట్లు అమ్మే ఉద్యోగిని తాళాలు వేసి గదిలో నిర్బంధించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి తాళాలు తీయించారు. సంబంధిత వ్యక్తులపై ఉద్యోగులు చిల్లకల్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

Updated Date - 2022-04-27T13:57:42+05:30 IST