ఎన్టీఆర్ జిల్లాలో విషాదం..

ABN , First Publish Date - 2022-05-29T16:07:07+05:30 IST

జి. కొండూరు మండలంలోని చిన్న నందిగామలో విషాదం చోటు చేసుకుంది. కొడుకు చనిపోయాడనే మనస్థాపంతో

ఎన్టీఆర్ జిల్లాలో విషాదం..

ఎన్టీఆర్ జిల్లా: జి. కొండూరు మండలంలోని చిన్న నందిగామలో విషాదం చోటు చేసుకుంది. కొడుకు చనిపోయాడనే మనస్థాపంతో దంపతులు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఇటీవల తమ కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుమారుడి మృతిని జీర్ణించుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డారు. కొడుకు లేని జీవితం వ్యర్థమని భార్యభర్తలు ఇద్దరు సూసైడ్ చేసుకోవడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి..కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు ఆరేపల్లి సాంబయ్య, లక్ష్మీలుగా పోలీసులు గుర్తించారు.

Updated Date - 2022-05-29T16:07:07+05:30 IST