NTR: రూ.450 కోసం వ్యక్తిపై బ్లేడ్తో దాడి
ABN , First Publish Date - 2022-06-07T17:55:25+05:30 IST
జిల్లాలోని కంచికచర్లలో గోపి అనే వ్యక్తిపై కొందరు వ్యక్తులు విచక్షణా రహితంగా బ్లేడ్తో దాడి చేశారు.
ఎన్టీఆర్: జిల్లాలోని కంచికచర్లలో గోపి అనే వ్యక్తిపై కొందరు వ్యక్తులు విచక్షణారహితంగా బ్లేడ్తో దాడి చేశారు. రూ.450 కోసం ఇద్దరు వ్యక్తులు దాడికి పాల్పడినట్లు సమాచారం. బ్లేడ్తో కాళ్లపై దాడి చేయడంతో గోపి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.