టీడీపీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జయంతి
ABN , First Publish Date - 2020-05-29T11:02:15+05:30 IST
టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆ ర్ జయంతిని గురువారం ఆ పార్టీ నాయకులు ఘనంగా
మహబూబ్నగర్ టౌన్ / దేవరకద్ర, మే 28 : టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆ ర్ జయంతిని గురువారం ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ఎన్టీఆర్ విగ్రహానికి ఆవు పాలతో అభిషకం చేసి పూల మాల వేశారు. అనంతరం ప్రజలకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నా యకులు నారాయణస్వామి, బాలప్ప, చంద్రశేఖర్రెడ్డి, మాలాద్రిరెడ్డి, చెన్నయ్య, కాశీం, రషీద్ రహబర్, మురళీ, కలీం తదితరులు ఉన్నారు. దేవరకద్రలో ఎన్టీఆ ర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో గోవర్ధన్రెడ్డి, నాగయ్యశెట్టి, రాజు తదితరులు పాల్గొన్నారు.