ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలకు ఒంగోలు ముస్తాబు

ABN , First Publish Date - 2022-05-25T09:10:43+05:30 IST

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు శత జయంతి ఉత్సవాలు ఒంగోలులో ప్రారంభం కానున్నాయి.

ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలకు ఒంగోలు ముస్తాబు

28న ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద ప్రారంభించనున్న చంద్రబాబు


ఒంగోలు, మే 24(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు శత జయంతి ఉత్సవాలు ఒంగోలులో ప్రారంభం కానున్నాయి. ఈనెల 28న ఒంగోలులోని అద్దంకి బస్టాండు సెంటర్‌లో ఉన్న ఎన్‌టీఆర్‌ కాంస్య విగ్రహం వద్ద పార్టీ అధినేత చంద్రబాబు నివాళులర్పించి ఉత్సవాలను ప్రారంభించనున్నారు. ఈ ఏడాది మహానాడు ఒంగోలు వేదికగా ఈనెల 27, 28 తేదీల్లో జరగనుంది. ఈనెల 28న ఎన్‌టీఆర్‌ శతజయంతి నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ తరఫున కార్యక్రమాలు నిర్వహించాలని టీడీపీ నిర్ణయించింది. మహానాడులో తొలి రోజైన 27న ప్రతినిధుల సభ జరగనుంది. 28న సాయంత్రం లక్షమందితో నిర్వహించనున్న బహిరంగసభకు సన్నాహలు చేస్తున్నారు. 

Updated Date - 2022-05-25T09:10:43+05:30 IST