వీఎస్‌యూ ఎన్‌ఎస్‌ఎస్‌ అధికారులకు పురస్కారాలు

ABN , First Publish Date - 2022-01-28T05:10:48+05:30 IST

ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ సేవ చేసిన వారికి గణతంత్ర వేడుకల సందర్భంగా ఇచ్చే ఉత్తమ సేవా పురస్కారాలకు విక్రమ సింహపురి యూనివర్సిటీలోని ముగ్గురు ఎన్‌ఎస్‌ఎస్‌ అధికారులు ఎంపికయ్యారు.

వీఎస్‌యూ ఎన్‌ఎస్‌ఎస్‌ అధికారులకు పురస్కారాలు
ఎన్‌ఎస్‌ఎస్‌ అధికారులకు సరిఫికెట్లను ప్రదానం చేస్తున్న వీసీ సుందరవల్లి

వెంకటాచలం, జనవరి 27 : ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ సేవ చేసిన వారికి గణతంత్ర వేడుకల సందర్భంగా ఇచ్చే ఉత్తమ సేవా పురస్కారాలకు విక్రమ సింహపురి యూనివర్సిటీలోని ముగ్గురు ఎన్‌ఎస్‌ఎస్‌ అధికారులు ఎంపికయ్యారు. వీఎస్‌యూ ఎన్‌ఎస్‌ఎస్‌ సమన్వయకర్త డాక్టర్‌ అల్లం ఉదయ్‌శంకర్‌, ప్రోగ్రామ్‌ అధికారి డాక్టర్‌ ఎం.వెంకటసుబ్బయ్య (విశ్వోదయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, వెంకటగిరి), ప్రోగ్రామ్‌ అధికారి డాక్టర్‌ పేరూరు వెంకటసాయి తేజ (శ్రీచైతన్య డిగ్రీ కళాశాల, కావలి)లకు గురువారం మండలంలోని కాకుటూరు వద్ద ఉన్న వీఎస్‌యూలో వీసీ జీఎం.సుందరవల్లి సరిఫికెట్లను ప్రదానం చేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గడిచిన ఏడాదిలో సంభవించిన కరోనా సెకండ్‌ వేవ్‌ సంక్షోభం, తుఫాను, వరదల సమయాల్లో వీఎస్‌యూ ఎన్‌ఎస్‌ఎస్‌ అధికారులు చేసిన సేవలకు గుర్తింపుగా ఉత్తమ సేవా పురస్కారాలకు ఎంపికైనట్లు తెలిపారు. కార్యక్రమంలో వీఎస్‌యూ రెక్టార్‌ ఎం.చంద్రయ్య, రిజిస్ర్టార్‌ డాక్టర్‌ లేబాకు విజయకృష్ణారెడ్డి, వర్సిటీ ప్రిన్సిపాల్‌ సుజాఎస్‌ నాయర్‌ తదితరులున్నారు. 


Updated Date - 2022-01-28T05:10:48+05:30 IST