ఎన్‌ఎస్‌ఎస్‌ రాష్ట్ర అధికారిగా అశోక్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-01-28T06:16:59+05:30 IST

జాతీయ సేవా పథకం(ఎన్‌ఎస్‌ఎస్‌) రాష్ట్ర అధికారిగా నిడమర్రుకు చెందిన డాక్టర్‌ అశోక్‌రెడ్డి నియమితులయ్యారు.

ఎన్‌ఎస్‌ఎస్‌ రాష్ట్ర అధికారిగా అశోక్‌రెడ్డి
బాధ్యతలు స్వీకరిస్తున్న డాక్టర్‌ అశోక్‌రెడ్డి

మంగళగిరి, జనవరి 27: జాతీయ సేవా పథకం(ఎన్‌ఎస్‌ఎస్‌) రాష్ట్ర  అధికారిగా నిడమర్రుకు చెందిన డాక్టర్‌ అశోక్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నతవిద్యాశాఖ సంచాలకులు జే శ్యామలారావు గురువారం ఉత్తర్వులను జారీ చేశారు. సచివాలయంలోని ఉన్నత విద్యాశాఖ కార్యాలయంలో గురువారం ఆయన బాధ్యతలను స్వీకరించారు. కృష్ణాజిల్లా మైలవరంలోని లక్కిరెడ్డి బాల్‌రెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాలలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ 15 ఏళ్లుగా జాతీయ సేవాపథకం ప్రోగ్రాం అధికారిగా డాక్టర్‌ అశోక్‌రెడ్డి  వ్యవహర్తిస్తున్నారు. విద్యార్థుల్లో సేవాభావాన్ని పెంపొందింపజేసే దిశగా అడుగులు వేస్తానని ఆయన తెలిపారు. 


Updated Date - 2022-01-28T06:16:59+05:30 IST