దీప యజ్ఞంలో పాల్గొని ఐక్యత చాటిన ఎన్నారైలు

ABN , First Publish Date - 2020-04-06T03:58:32+05:30 IST

కరోనా‌పై పోరాటంలో భాగంగా ప్రధాని మోదీ పిలుపు మేరకు దేశ ప్రజలు దీపాలు వెలిగించి ఐక్యతను చాటారు. ఆదివారం రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు

దీప యజ్ఞంలో పాల్గొని ఐక్యత చాటిన ఎన్నారైలు

న్యూఢిల్లీ: కరోనా‌పై పోరాటంలో భాగంగా ప్రధాని మోదీ పిలుపు మేరకు దేశ ప్రజలు దీపాలు వెలిగించి ఐక్యతను చాటారు. ఆదివారం రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు దేశవ్యాప్తంగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరిగింది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. అటు రాజకీయ నాయకుల నుంచి ఇటు సినీ ప్రముఖుల వరకు ప్రతి ఒక్కరు దీపాలు వెలిగించి కరోనాపై పోరాటానికి తమ మద్దతు తెలిపారు. గో కరోనా అంటూ దేశ ప్రజలు నినాదాలు చేశారు. అటు పల్లెల్లో నివసిస్తున్న ప్రజలు కూడా జ్యోతులు వెలిగించి ఐక్యత చాటుకున్నారు. భారతదేశంలో నివసిస్తున్న వారే కాకుండా విదేశాల్లో ఉన్న తెలుగు వారు కూడా మోదీ పిలుపు మేరకు దీప యజ్ఞంలో పాల్గొన్నారు. కిర్గిస్థాన్‌లోని జలాలాబాద్ మెడికల్ కళాశాలలో చదువుకుంటున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన వైద్య విద్యార్థులు తమ ఫోన్లలో టార్చ్ లైట్ ఆన్ చేసి కరోనా మహమ్మారి తొలగిపోవాలని కోరుకున్నారు. 

Updated Date - 2020-04-06T03:58:32+05:30 IST