హుజురాబాద్‌లో గెల్లు గెలుపు కోసం ఎన్నారై టీఆర్ఎస్ విస్తృత ప్రచారం: అనిల్ కూర్మాచలం

ABN , First Publish Date - 2021-10-27T21:35:44+05:30 IST

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు కోసం ఎన్నారై టీఆర్ఎస్ ఎన్నో వారాల నుండి విస్తృత ప్రచారం నిర్వహిస్తుందని ఎన్నారై టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం తెలిపారు.

హుజురాబాద్‌లో గెల్లు గెలుపు కోసం ఎన్నారై టీఆర్ఎస్ విస్తృత ప్రచారం: అనిల్ కూర్మాచలం

హుజురాబాద్: హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు కోసం ఎన్నారై టీఆర్ఎస్ ఎన్నో వారాల నుండి విస్తృత ప్రచారం నిర్వహిస్తుందని ఎన్నారై టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం తెలిపారు. ఎక్కడికి వెళ్ళినా మా ఓటు కేసీఆర్ సార్‌కే అని అన్ని వర్గాల ప్రజలు చెప్తున్నారని, సర్వేలన్నీ టీఆర్ఎస్ అభ్యర్ధిదే విజయంగా పేర్కొంటున్నాయని అనిల్ కూర్మాచలం అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పర్యటించి ప్రచారం నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. ఎక్కడికి వెళ్ళిన ప్రజలంతా కేసీఆర్ వెంటే ఉన్నామని, వెన్నుపోటు ఈటలకు తగిన బుద్ది చెప్తామని ప్రజలు చెప్తున్నట్టు అనిల్ తెలిపారు. 


ఇక బాధ్యత గల టీఆర్ఎస్ కార్యకర్తలుగా ఎన్నిక ఏదైనా టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం పని చేస్తున్న విషయం అందరికీ తెలిసిందేనని చెప్పారు. అలాగే ఇప్పుడు గెల్లు శ్రీనివాస్ గెలుపు కోసం ఎన్నారై టీఆర్ఎస్ అటు సోషల్ మీడియా ద్వారా ఇటు క్షేత్రస్థాయిలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తుందని అనిల్ తెలిపారు. కేసీఆర్‌కు హుజురాబాద్ అంటే ప్రత్యేక అభిమానమున్న సంగతి ఇక్కడి ప్రజలకు తెలుసునని, అందుకే వారు మా ఓటు కారు గుర్తుకేనని చెప్తున్నారన్నారు. ముఖ్యంగా దళిత వాడల్లో పండగ వాతావరణమున్నదని ఆయన పేర్కొన్నారు. 'దళిత బంధు'తో మా జీవితాలే మారిపోయాయని, కేసీఆర్ మాకు తండ్రి లాంటి వాడని, గెల్లు శ్రీనివాస్‌ను భారీ మెజారిటీతో గెలిపించుకుని సీఎంకు కృతజ్ఞత తెలియజేసుకుంటామని దళిత బిడ్డలు చెప్తున్నట్టు అనిల్ తెలిపారు. 


హుజురాబాద్‌లో అభివృద్ధి జరగాలంటే టీఆర్ఎస్ అభ్యర్థినే భారీ మెజారిటీతో గెలిపించాలని అనిల్ కోరారు. బీజేపీకి ఓటు వేస్తే హుజురాబాద్‌కి వచ్చే లాభమేం లేదన్నారు. రోజు రోజుకి ధరలు పెరగడం తప్పితే, నేడు గెలిచిన బీజేపీ ప్రజా ప్రతినిధులు వారి నియోజకవర్గాల అభివృద్ధికి ఎం చేశారో చెప్పి ఓట్లు అడగాలని తెలిపారు. ప్రజలు కూడా విజ్ఞతతో అలోచించి అభివృద్ధి సంక్షేమాన్ని అందిస్తున్న టీఆర్ఎస్ పార్టీకే ఓటు వేయ్యాలని అనిల్ కూర్మాచలం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నిక తేదీ సమీపిస్తున్న కొద్దీ బీజేపీ పార్టీ నానా డ్రామాలు చేస్తారని ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారాలు చేస్తారని కావున ప్రజలంతా వాటిని నమ్మకుండా ఓటుతో వారికి తగిన బుద్ది చెప్పాలని ఆయన ప్రజలను సూచించారు. 


ఎన్నారై టీఆర్ఎస్ నాయకుల ప్రచారానికి సహకరించి ప్రోత్సహించిన ఎన్నికల ఇంచార్జ్ మంత్రి హరీష్ రావుకు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్‌కు, మంత్రి గంగుల కమలాకర్‌కు, ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి, స్థానిక నాయకులకు, ఇతర ప్రజా ప్రతినిథులకు ఎన్నారై టీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాజ్ కుమార్ శానబోయినకు, మీడియా మిత్రులకు, టీఆర్ఎస్ కార్యకర్తలకు అనిల్ కూర్మాచలం ఈ సందర్భంగా ప్రత్యేకంగా కృతఙ్ఞతలు తెలిపారు.

Updated Date - 2021-10-27T21:35:44+05:30 IST