ఎంత కష్టపడ్డా సంపాదన అంతంత మాత్రమే.. కానీ ఒక్కపనితో రాత్రికి రాత్రే లక్షధికారిగా మారిన NRI

ABN , First Publish Date - 2022-02-19T13:52:10+05:30 IST

ఏటా వేలాది మంది భారత్ నుంచి గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్తూ ఉంటారు. ఈ క్రమంలో అందరిలాగే అతడు కూడా ఎడారి దేశం బాట పట్టాడు. అక్కడ ఓ సంస్థలో చేరి రాత్రి పగలూ తేడా లేకుండా కష్టపడి పని

ఎంత కష్టపడ్డా సంపాదన అంతంత మాత్రమే.. కానీ ఒక్కపనితో రాత్రికి రాత్రే లక్షధికారిగా మారిన NRI

ఇంటర్నెట్ డెస్క్: ఏటా వేలాది మంది భారత్ నుంచి గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్తూ ఉంటారు. ఈ క్రమంలో అందరిలాగే అతడు కూడా ఎడారి దేశం బాట పట్టాడు. అక్కడ ఓ సంస్థలో చేరి రాత్రి పగలూ తేడా లేకుండా కష్టపడి పని చేయడం ప్రారంభించాడు. అయితే వచ్చే సంపాదన అతడికి ఏ మాత్రం జీవితంపై భరోసా ఇవ్వలేదు. పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా మార్చొచ్చనే నమ్మకాన్ని ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో అతడు చేసిన ఒకే ఒక్కపని రాత్రి రాత్రే లక్షధికారిగా మార్చింది. ఇంతకూ విషయం ఏంటంటే..



ఇండియాకు చెందిన వెంకటేషన్ కొన్నేళ్ల క్రితం అబుధాబి వెళ్లాడు. అక్కడి ఓ సంస్థలో ఐటీ ప్రొఫెషనల్‌గా కెరీర్ ప్రారంభించాడు. నెలనెలా కొంత మొత్తంలో జీతాన్ని అందుకుంటున్నాడు. అయితే.. ఆ సంపాదనతో అతడు సంతృప్తి చెందలేదు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం లాటరీ టికెట్‌ను కొనుగోలు చేశాడు. తాజాగా లాటరీ నిర్వాహకులు విజేతల వివరాలను ప్రకటించగా.. అందులో వెంకటేషన్ ఏకంగా లక్ష దిర్హమ్‌లు (సుమారు రూ.20.33లక్షలు) గెలుచుకున్నాడు. మహజూజ్ రాఫెల్ డ్రాలో పెద్ద మొత్తంలో డబ్బులు గెలుచుకోవడం పట్ల వెంకటేషన్ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. అంతేకాకుండా ఈ డబ్బులతో తన కుటుంబాన్ని మొత్తం వెకేషన్ కోసం యూఏఈ తీసుకొస్తానని తెలిపాడు. అంతేకాకుండా తన పిల్లల ఉన్నత చదువుల కోసం కొంత మొత్తాన్ని కేటాయించనున్నట్టు వెల్లడించాడు. 




Updated Date - 2022-02-19T13:52:10+05:30 IST