'వీ-కేర్' ద్వారా ఎన్నారై టీఆర్ఎస్ యూకే సహాయం

ABN , First Publish Date - 2020-10-26T21:28:51+05:30 IST

ఇటీవల కురిసిన అధిక వర్షాల వల్ల హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో ఇల్లు దెబ్బతిని నష్టపోయిన ప్రజలకు సహాయం చేయ్యాలనే సంకల్పంతో "వీ-కేర్: మేమున్నాము" అనే కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు ఎన్నారై టీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి తెలిపారు.

'వీ-కేర్' ద్వారా ఎన్నారై టీఆర్ఎస్ యూకే సహాయం

నిత్యావసర సరుకులు, మందుల పంపిణీ

లండన్: ఇటీవల కురిసిన అధిక వర్షాల వల్ల హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో ఇల్లు దెబ్బతిని నష్టపోయిన ప్రజలకు సహాయం చేయ్యాలనే సంకల్పంతో "వీ-కేర్:  మేమున్నాము" అనే కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు ఎన్నారై టీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి తెలిపారు. ఈ 'వీ-కేర్' కిట్లో నిత్యావసర సరుకులతో పాటు వర్షాల వల్ల పెద్దలకు, చిన్న పిల్లలకు వచ్చే జ్వరం, జలుబు, ఇతర నొప్పులకు ఉపయోగపడే మందులను డాక్టర్ సలహా మేరకు ఉచితంగా పంపిణి చేస్తున్నట్టు చెప్పారు. మొదటి విడతలో సుమారు ౩౦౦ పైగా కిట్లను నగరంలోని వివిధ ప్రాంతాల్లో పంపిణీ చేశామని తెలిపారు. వీటిలో సుమారు 200 కిట్లను ఘట్కేసర్ మండలంలోని చౌదరిగూడ గ్రామంలో టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేసినట్టు అశోక్ గౌడ్ పేర్కొన్నారు.


#wecare(మేమున్నాం) అని #NRITRSUK చేపట్టిన కార్యక్రమాన్ని ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్ రెడ్డి అభినందించారు. మేము సైతం అని  కష్టలలో ఉన్నవారిని ఆదుకోవాలని ముందుకు వచ్చిన ఎన్నారై టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం, అధ్యక్షులు అశోక్ గౌడ్ దూసరి, కార్యవర్గ సభ్యులని ప్రసంశించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్నారై టీఆర్ఎస్ నాయకులు మల్లేష్ పప్పుల మాట్లాడుతూ... అటు పార్టీ కార్యక్రమాలతో పాటు ఇలా ఎన్నో సహాయక కార్యక్రమాలకు అన్ని సందర్భాల్లో స్పందించి తమ సమయంతో పాటు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న ఎన్నారై టీఆర్ఎస్ యూకే ప్రతి కార్యవర్గ సభ్యుడిని అభించనందించడంతో పాటు కృతఙ్ఞతలు తెలియజేరు. ఈ కార్యక్రమంలో మర్రి రాజశేఖర్ రెడ్డితో సహా స్థానిక టీఆర్ఎస్ నేతలు, ఎన్నారై టీఆర్ఎస్ నాయకులు మల్లేష్ పప్పుల, ప్రవీణ్ పంతులు, సుభాష్ తదితరులు పాల్గొన్నారు.





Updated Date - 2020-10-26T21:28:51+05:30 IST